టాలీవుడ్ క్యూట్ జోడీలలో మహేష్ బాబు నమ్రత జోడీ ఒకటనే సంగతి తెలిసిందే.మహేష్ నమ్రత పెళ్లి తర్వాత అన్యోన్యంగా జీవనం సాగిస్తూ సంతోషంగా జీవితం గడుపుతున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నారు.ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
మహేష్ బాబు కుటుంబానికి ఎంతగానో ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే.
సూపర్ స్టార్ మహేష్ బాబు రెస్టారెంట్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని గతంలో వార్తలు వైరల్ అయ్యాయి.
అయితే నమ్రత పేరుపై ఈ బిజినెస్ పనులను మహేష్ బాబు మొదలుపెట్టనున్నారని సమాచారం అందుతోంది.ఈ విషయం తెలిసి మహేష్ బాబు అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు.భార్యపై మహేష్ బాబు ప్రేమను చూపిస్తున్న విధానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
మరోవైపు మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూటింగ్ నత్తనడకన జరుగుతోంది.
ఈ సినిమా కోసం మహేష్ బాబు తన సినీ కెరీర్ లో గతంలో ఏ సినిమాకు తీసుకోని స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.త్రివిక్రమ్ సినిమాను వేగంగా పూర్తి చేసి రాజమౌళి సినిమాను మొదలుపెట్టాలని మహేష్ బాబు భావిస్తున్నా అందుకు భిన్నంగా జరుగుతోంది.
మహేష్ తర్వాత ప్రాజెక్ట్ లు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాల్సి ఉంది.

వరుస విజయాలతో జోరుమీదున్న మహేష్ బాబు కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.మహేష్ బాబు భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకుని పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింత పెంచుకుంటాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.మహేష్ బాబు కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.
మహేష్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.