మంత్రి విడదల రజిని పవన్ కళ్యాణ్ పై హాట్ కామెంట్స్

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు మతిభ్రమించి ఏదేదో మాట్లాడుతున్నాడని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మండిపడ్డారు.పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యలపై మంత్రి విడదల రజిని చిలకలూరిపేటలో స్పందించారు.

 Hot Comments On Rajini Pawan Kalyan's Resignation-TeluguStop.com

ఆమె మాట్లాడుతూ పవన్‌కల్యాణ్‌ లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు రాజకీయాలకు పనికిరారని తెలిపారు.ఆయన్ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టుగా ఉంటుందనే విషయం జనసేన కార్యకర్తలకూ తెలిసిపోయిందని చెప్పారు.

రెండు నియోజకవర్గాల్లో ఒకసారి ప్రజలు బుద్ధి చెప్పారన్నారు.చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్‌ పయనిస్తున్నాడని, ఇప్పటి వరకు ముసుగులో ఉన్న వారిద్దరు ఈరోజు ముసుగు తొలగించుకుని బయటకు వచ్చారని మంత్రి విమర్శించారు.

బాబూ.ఏ ముఖం పెట్టుకుని పర్యటనలు? అధికారంలో ఉండగా రైతులను ఏమాత్రం పట్టించుకోని టీడీపీ అధినేత చంద్రబాబు పల్నాడు జిల్లాలో పంట పొలాల పరిశీలనకు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వస్తారని రజిని ప్రశ్నించారు.అధిక వర్షాల వల్ల పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని యడ్లపాడు, నాదెండ్ల మండలాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి మంగళవారం విలేకరులతో మాట్లాడారు.రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అన్నదాతలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని గుర్తు చేశారు.

బాబు, కరువు కవల పిల్లలని ఎద్దేవా చేశారు.ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రైతులకు ఎంతో మేలు చేకూరుతున్నదని మంత్రి విడదల రజిని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube