జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.నీ ప్యాకేజీ ఊపులకు ఉడతలు కూడా భయపడవని తెలిపారు.
చంద్రబాబు మోచేతి నీళ్లు తాగి వైసీపీని దించుతానంటావు కానీ.నేనే గద్దెనెక్కుతాననలేవని ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు.
నీదొక రాజకీయ పార్టీనా ? అని మంత్రి అంబటి ప్రశ్నించారు.గత కొద్ది రోజులుగా వైసీపీ మంత్రులు, జనసేనాని పవన్ కల్యాణ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా రెండు రోజుల క్రితం విశాఖలో మంత్రుల వాహనాలపై జనసేన పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.







