టాలీవుడ్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవల మరణించిన విషయం తెలిసిందే.రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణ వార్తను ఇటు అభిమానులు, అటు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ప్రభాస్, ఆయన కుటుంబ సభ్యులు అలాగే రెబల్ స్టార్ కృష్ణంరాజు అభిమానులు ఆ బాధ నుంచి కోలుకోలేకపోతున్నారు.మరొకవైపు పలువురు ప్రముఖులు సైతం కృష్ణంరాజుతో వారికున్న అనుబంధాలను గుర్తు చేసుకుంటున్నారు.
ఇక ఇది ఇలా ఉంటే ప్రభాస్, రెబల్ స్టార్ కృష్ణంరాజు కలిసి నటించిన చిత్రం బిల్లా.
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరో, దర్శకుల పుట్టినరోజు సందర్భంగా వారికి ఇష్టమైన సినిమాలను అలాగే వారి కెరియర్ లో అత్యధిక కలెక్షన్ లు సాధించిన సినిమాలను థియేటర్లలో స్పెషల్ గా ప్రదర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 23వ తేదీన డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా థియేటర్లలో బిల్లా సినిమాను మరొకసారి 4కె లో థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేయగా ఆ సమావేశంలో కృష్ణంరాజు కుమార్తె సాయి ప్రసీద కమెడియన్ ఆలీ, దర్శకుడు మోహన్ రమేష్, రామ జోగీయ శాస్త్రి, సంగీత దర్శకుడు మణిశర్మ పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే తండ్రి మరణం తర్వాత మొదటిసారిగా మీడియా ముందుకు వచ్చింది సాయి ప్రసీద.
![Telugu Billa, Ali, Krishnam Raju, Meher Ramesh, Prabhas, Sai Praseeda, Tollywood Telugu Billa, Ali, Krishnam Raju, Meher Ramesh, Prabhas, Sai Praseeda, Tollywood](https://telugustop.com/wp-content/uploads/2022/10/krishnam-raju-daughter-sai-praseeda-about-billa-re-release-detailss.jpg )
ఈ సందర్భంగా మీడియా సమావేశంలో సాయి ప్రసీద మాట్లాడుతూ.బిల్లా సినిమాలో మాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి.గోపీకృష్ణా మూవీస్ బ్యానర్ లో నాన్న, అన్నయ్య ప్రభాస్ కలిసి నటించిన తొలి సినిమా ఇది.ఈ సినిమా అంటే నాన్నకు ఎంతో ఇష్టం.ఈ చిత్రాన్ని 4కెలో రీరిలీజ్ చేస్తున్నందుకు మెహర్ రమేశ్ అంకుల్కు థాంక్యూ అని తెలిపింది సాయి ప్రసీద.
ఈ స్పెషల్ షోల ద్వారా వచ్చే లాభాలను యూకే ఇండియా డయాబెటిక్ ఫుడ్ ఫౌండేషన్కు అందిస్తాము.ఇందులో నాన్న భాగస్వామిగా ఉన్నారు.ఫ్యాన్స్ ఈ మూవీని మళ్లీ థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది సాయి ప్రసీద.
.