బీజేపీకి షాక్ ఇచ్చింది మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(MNS).ఇప్పటి వరకు ముంబై నగరపాలక ఎన్నికల్లో బీజేపీలో పొత్తు పెట్టుకుంటుందంటూ జరిగిన ప్రచారానికి ఎండ్ కార్డ్ వేసింది.
తాజాగా జరిగిన పార్టీ సమావేశంలో ఎంఎన్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ సమావేశంలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఈ సమావేశంలో ఎంఎన్ఎస్ వ్యవస్థాపకుడు రాజ్ థాకరే రాబోయే ఎన్నికలలో పొత్తుతో సహా పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపారు.