నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైకెర్టరేట్ విచారించింది.ఈ కేసులో ప్రమేయం ఉందంటూ తెలంగాణకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు ఇదివరకే ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ నోటీసులకు అనుగుణంగా మాజీ మంత్రి గీతారెడ్డి ఇటీవలే ఈడీ విచారణకు హాజరైయ్యారు.తాజాగా ఈడీ నోటీసులకు అనుగుణంగా సుదర్శన్ రెడ్డి ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు.
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా సుదర్శన్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు.యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు అందించారన్న ఆరోపణలపై సుదర్శన్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.







