కాంగ్రెస్ తెలంగాణ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ రేపు హైదరాబాద్ కు రానున్నారు.రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించడంతో పాటు మునుగోడు ఉపఎన్నిక కూడా ఉన్న నేపథ్యంలో ఆయన దాదాపు నెల రోజులపాటు తెలంగాణలోనే మకాం వేయనున్నారు.
ఈ క్రమంలో ఉపఎన్నికలో పార్టీ పనితీరును పరిశీలించేందుకు మునుగోడులో ఠాగూర్ పర్యటించనున్నారు.మాణిక్కం ఠాగూర్ రంగంలోకి దిగడంతో పార్టీ క్యాడర్ మరింత చురుగ్గా ముందుకు సాగుతోందని చెప్పొచ్చు.
ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పార్టీ ఇంఛార్జ్ లు మకాం వేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఉపఎన్నికలో గెలుపే ధ్యేయంగా నేతలు చేయాల్సిన కార్యాచరణపై, రాహుల్ పాదయాత్ర రూట్ మ్యాప్ పై కూడా ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.







