తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ క్రమంలో 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను ప్రకటించింది.మిగతా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
మూడు రోజుల తర్వాత కూడా మరో రెండు రోజులు వానలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.







