తమిళనాడు సీఎం స్టాలిన్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.చెన్నైలో జరిగిన డీఎంకే పార్టీ జనరల్ అసెంబ్లీ కౌన్సిల్ సమావేశంలో ఆయనను పార్టీ చీఫ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది.
అదేవిధంగా పార్టీ నేతలు దురైమరుగన్, టీఆర్ బాలులు కూడా జనరల్ సెక్రటరీ, ట్రెజరీ అధికారులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అయితే ఈ ముగ్గురు నేతలు వరుసగా రెండో సారి పార్టీ అత్యున్నత పదవులు చేపట్టడం విశేషంగా చెప్పొచ్చు.







