మహారాష్ట్ర రాజధాని ముంబై మహా నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.చెంబూర్లో 12 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి.
ఈ భవనంలో చాలామంది చిక్కుకున్నారు.ప్రాణాలను రక్షించుకునేందుకు చాలామంది కిటికీల నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.







