నేడు తెలంగాణ బీజేపీ పదాధికారుల సమావేశం జరగనుంది.రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జ్ లు కూడా పాల్గొననున్నారు.
అదేవిధంగా ముఖ్య అతిథులుగా తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ హాజరుకానున్నారు.మునుగోడు ఉపఎన్నిక, తాజా రాజకీయాలతో పాటు పార్టీ చేరికలపై ప్రధానంగా చర్చించనున్నారు.
మరోవైపు రేపు మెదక్ జిల్లా నరసాపూర్ లో బీజేపీ బహిరంగ సభ నిర్వహించనున్న సంగతి తెలిసిందే.కాగా ఈ సభకు కేంద్రమంత్రి భూపేందర్ సింగ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.







