ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.విశాఖ రాజధాని కోసం మంత్రి పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించారు.
సీఎం జగన్ ఆదేశిస్తే విశాఖ రాజధాని ఉద్యమంలోకి వెళ్తానన్నారు.సామాన్యుడిగా ఉద్యమిస్తే తన వెనుక లక్షలాది మంది ప్రజలు వస్తారని చెప్పారు.
మా గడ్డ మీదకు వచ్చి రాజధాని వద్దు అని చెప్పే దౌర్జన్యం ఏమిటి అని ప్రశ్నించారు.ఉత్తరాంధ్ర ప్రజలు తెగించి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
విశాఖ రాజధాని కావాలన్నారు.ఇందుకోసం గ్రామాల్లోని ప్రతి పౌరుడిని సంఘటితం చేస్తామని మంత్రి ధర్మాన స్పష్టం చేశారు.







