వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఢిల్లీలో పర్యటిస్తున్నారు.దీనిలో భాగంగా నేడు ఆమె పలువురు కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారని తెలుస్తోంది.
అదేవిధంగా సీబీఐ అధికారులను సైతం కలవనున్నారు.తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలపై షర్మిల ఫిర్యాదు చేయనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై దర్యాప్తు జరపాలని సీబీఐ, కేంద్ర హోంశాఖ అధికారులను ఆమె కోరనున్నారని సమాచారం.అయితే, వైఎస్ షర్మిల పార్టీ పెట్టిన సమయం నుండి ఇప్పటివరకు బీజేపీకి వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.
ఈ నేపథ్యంలో షర్మిల ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.







