వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి మరో కీలక పదవి దక్కింది.రవాణా, సాంస్కృతిక, పర్యాటక శాఖలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీకి ఆయన చైర్మన్గా నియమితులయ్యారు.
ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ హోదాలో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ విషయాన్ని విజయసాయి రెడ్డి తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఈ కమిటీలో ఉపరితల రవాణా, పౌర విమానయానం, నౌకాయానం, పర్యాటకం, సాంస్కృతిక శాఖలకు చెందిన అంశాలు ఉంటాయి.