విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రులు రేపటితో ముగియనున్నాయి.మధ్యాహ్నం 12 గంటలకు పూర్ణాహుతితో ఉత్సవాలను ముగించనున్నారు.
అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వారి తెప్పోత్సవం కార్యక్రమం జరగనుంది.అయితే, ఈసారి వరద ఉధృతి కారణంగా ఉత్సవ మూర్తుల జలవిహారం రద్దు చేశారు.మరోవైపు ఇంద్రకీలాద్రిపై రూ.500 టికెట్లు మాత్రమే విక్రయించనున్నారు ఆలయ అధికారులు.మిగతా భక్తులందరికీ అమ్మవారి ఉచిత దర్శనం కల్పించనున్నారు.







