ఆదిపురుష్ దర్శకునిపై షాకింగ్ కామెంట్లు చేసిన కేజీఎఫ్ నటి.. ఎన్టీఆర్ పేరు చెబుతూ?

ఆదిపురుష్ టీజర్ గురించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో నెగిటివ్ గానే ఎక్కువగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

కొంతమంది ఈ సినిమా యానిమేషన్ మూవీ అని కామెంట్లు చేస్తుండగా మరి కొందరు కార్టూన్ మూవీ అని కామెంట్లు చేస్తున్నారు.

ఆదిపురుష్ మూవీ గురించి జరుగుతున్న నెగిటివ్ ప్రచారం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెడుతోంది.అయితే కేజీఎఫ్ నటి మాళవికా అవినాష్ ఈ టీజర్ గురించి స్పందిస్తూ షాకింగ్ కామెంట్లు చేశారు.

ఆదిపురుష్ డైరెక్టర్ సినిమాను తెరకెక్కించిన విధానాన్ని ఆమె తప్పుబట్టారు.రావణుడు శివుని భక్తుడని లంకలో ఉంటాడని 64 కళలలో అతనికి ప్రావీణ్యం ఉంటుందని అయితే మన చరిత్రను, రామాయణంను బాలీవుడ్ డైరెక్టర్లు వక్రీకరిస్తున్నారని ఆమె కామెంట్లు చేశారు.

రామయణం చదవలేదా అని ఆమె కామెంట్లు చేశారు.కనీసం సీనియర్ ఎన్టీఆర్ పోషించిన పాత్రలనైనా చూడలేదా అని ఆమె అన్నారు.

Advertisement

సినిమాలను చూసైనా రావణాసురుడు ఏ విధంగా ఉండాలో తెలుసుకోవాలంటూ మాళవికా అవినాష్ చెప్పుకొచ్చారు.

మాళవికా అవినాష్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ విమర్శల గురించి దర్శకుడు ఓం రౌత్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంది.ఆదిపురుష్ గురించి వ్యక్తమవుతున్న విమర్శలపై ప్రభాస్ ఏమంటారో చూడాలి.

వరుస విజయాలతో జోరుమీదున్న ప్రభాస్ కు బాహుబలి2 తర్వాత సరైన సక్సెస్ దక్కలేదు.

తర్వాత ప్రాజెక్ట్ లతో ప్రభాస్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఆదిపురుష్, సలార్ సినిమలు ప్రభాస్ ఆశలను నెరవేరుస్తాయేమో చూడాలి.ఆదిపురుష్ గురించి ఎక్కువమంది నెగిటివ్ కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

ఈ నెగిటివ్ కామెంట్ల వల్ల సినిమాకు ఊహించని స్థాయిలో నష్టం కలిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.మాళవికా అవినాష్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు