ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై దాడి ఘటన కలకలం సృష్టిస్తోంది.గుజరాత్కే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కేజ్రీవాల్ను లక్ష్యంగా చేసుకుని వెనక నుంచి ఆయనపైకి గుర్తు తెలియని వ్యక్తి బాటిల్వ్య విసిరినట్లు తెలుస్తుంది.
అయితే ఆ వాటర్ బాటిల్ కేజ్రీవాల్ దాటుకుని ముందుకు వెళ్లగా ఈ విషయాన్ని కేజ్రీవాల్ పట్టించుకోలేదని సమాచారం.గుజరాత్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ ప్రచారంలో స్పీడు పెంచిన కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్తో కలిసి రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.







