ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గడపగడప పర్యటన కార్యక్రమంలో టీడీపీ పార్టీకి చెందిన శివన్న అనే వ్యక్తి తమకి వైసీపీ ప్రభుత్వ పథకాల అవసరం లేదని చెప్పడం తెలిసిందే.ఎమ్మెల్యే సామరస్యంగా వెళ్లి మాట్లాడుతున్న గాని సదరు వ్యక్తి దురుసుగా ప్రవర్తించడంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి సదరు ఏరియా వాలంటీర్ ని పిలిపించి.
వీళ్ళకి పథకాలు వద్దంటున్నారు.ఎందుకు బలవంతంగా ఇస్తున్నారు.
తప్పు కదా.తీసేయండి అంటూ తెలియజేశారు.
ఈ పథకాల కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు వాళ్ళకి న్యాయం చేసినట్లు అవుతుంది అని అన్నారు.అయితే ఈ విషయంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నాయి.ఇలాంటి తరుణంలో వైసీపీ పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.స్పందించారు.
ఎమ్మెల్యే గడప గడపకు వస్తుండటంతో ఇంటిపై తెలుగుదేశం జెండా కట్టి – పరుషంగా మాట్లాడిన కొందన్నగారి శివన్నకి మూడేళ్లలో 90 వేలకు పైగా లబ్ది.కులం, మతం, ప్రాంతం, పార్టీ, వర్గం చూడకుండా ప్రజలందరికీ లబ్ది.అందరి సంక్షేమమే జగన్ గారి ప్రభుత్వ లక్ష్యం అంటే ఇదే.అని ఆధారాలతో సహా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.