తమిళ హీరో సూర్య గురించి మనందరికీ తెలిసిందే.హీరో సూర్యకు తమిళ సినీ ఇండస్ట్రీ తో పాటు తెలుగులో కూడా భారీగానే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.
ఇక ఇది ఇలా ఉంటే సూర్య ప్రస్తుతం డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా సూర్య 42వ సినిమాగా రూపొందుతుంది.
స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే.
ఇందులో సూర్య సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటాని హీరోయిన్గా నటిస్తోంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి.
షూటింగ్ స్పాట్ లో దిశా పటాని సూర్య కలిసి ఉన్న ఫోటోలను ఎవరు సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఆ ఫోటోలో దర్శకుడు శివ కూడా కనిపించారు.
బీచ్సైడ్ రెస్టారెంట్లో హీరోహీరోయిన్లతో చిత్రీకరిస్తున్న సన్నివేశానికి సంబంధించిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయ్యాయి.సెట్స్ నుంచి ఫోటోలు లీక్ అవడం పట్ల తాజాగా నిర్మాణ సంస్థ స్టూడియో స్పందించింది.
తమ సినిమా సెట్స్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఎక్కడా షేర్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తూనే అలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అంటూ గట్టిగా హెచ్చరించింది.
ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ట్వీట్ ని కూడా చేశారు.చిత్ర బృందమంతా తమ రక్తాన్ని, చెమటను దారబోసి ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు.ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందించేలా ఈ సినిమాను తీసుకురావాలని మేం కోరుకుంటున్నాము.
మీరు పబ్లిష్ చేసిన వీడియోలు, ఫొటోలు డిలీట్ చేస్తే మాకు ఎంతో మేలు చేసినవారు అవుతారు.అలాగే, ఈ ఫొటోలు, వీడియోలను భవిష్యత్తులోనూ షేర్ చేయవద్దని కోరుకుంటున్నాంము.
మా అభ్యర్థనను కాదని ఎవరైనా ఇదే పనిని కొనసాగిస్తే కాపీరైట్ ఉల్లంఘన కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని రాసుకొచ్చారు.