ప్రశాంత్ కిషోర్‌పై రాజకీయ పార్టీలు విశ్వాసం కోల్పోతున్నాయా?

పోల్ మాంత్రికుడు ప్రశాంత్ కిషోర్ టచ్ కోల్పోయారా? ఆయన వ్యూహాలు గతంలో లాగా పనిచేయడం లేదా? ప్రశాంత్ కిషోర్ మిస్టరీ కోడ్‌ను ప్రత్యర్థులు ఛేదించారా? ప్రశాంత్ కిషోర్ వ్యూహాలపై రాజకీయ పార్టీలు విశ్వాసం కోల్పోయారా? ప్రస్తుత పరిస్థితులు చూస్తే అలానే అనిపిస్తుంది.2015లో నితీష్‌ కుమార్‌, 2019లో ఆప్‌, 2020లో తృణమూల్‌ కాంగ్రెస్‌, ఏపీలో వైఎస్‌ఆర్‌సీపీ, తమిళనాడులో డీఎంకే విజయంలో ఆయన పాత్ర ఎనలేనిదని కొనియాడారు.

ఇప్పుడు ఈ పార్టీలన్నీ ఇప్పటికే అపాధరణమైన ప్రజల మద్దతును పొందుతున్నాయి.

ప్రస్తుతం టీమ్ PK ఈ పార్టీ చేస్తున్న సేవలు తాత్కలికంగానే మారాయి.యూపీ, పంజాబ్‌లలో కాంగ్రెస్‌ను గెలిపించడంలో PK టీమ్ విఫలమైంది.గోవా విషయంలోనూ అదే జరిగింది.

గోవాలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ దాదాపు 18 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది.కాంగ్రెస్ దాదాపు 13 కోట్లు ఖర్చు చేసింది.

కానీ, తృణమూల్ కాంగ్రెస్, పీకే సహాయంతో అక్కడ వ్యూహాలు రచిచింది.భారీగా 47.54 కోట్లు ఖర్చు చేసింది.ఇది బీజేపీ ఖర్చు కంటే రెండు రెట్లు ఎక్కువ.

Advertisement

ఇన్ని చేసినా ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది.

మహారాష్ట్రలో కూడా, పికె ఎన్‌సిఆర్‌కు సహాయం చేసింది, అయన అక్కడ ఆ పార్టీ అంతలా ప్రభావం చూపలేకపోయింది.ఇప్పుడు, PK సమర్థత, అతని వ్యూహాలపై సందేహాలు మొదలయ్యాయి.ప్రస్తుతం టిఆర్ఎస్ బాస్ కెసిఆర్ కూడా టీమ్ పికెతో ఒప్పందాన్ని నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు, PK సామర్థ్యంపై కేసీఆర్‌కు కూడా అనుమానం మెుదలైంది.

ప్రశాంత్ కిషోర్ మాత్రమే కాకుండా చాలా మంది రాజకీయ వ్యూహాకర్తలు బయటకు వచ్చారు.PK టీమ్ సేవలు చాలా ఖరీదైనవిగా, వివిధ పార్టీలకు ఆయన టీమ్ పని చేస్తుండడంతో వివిధ పార్టీలు ప్రశాంత్ కిషోర్ సేవలపై ఆసక్తి చూపడడం లేదు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు