ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చర్యలకు సిద్ధం అయింది.కమిటీ నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకుంది.
ఈ క్రమంలో రంగారెడ్డి డీఎంహెచ్ఓ స్వరాజ్య లక్ష్మీపై బదిలీ వేటు వేశారు.మొత్తం 13 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకొన్నారు.
అంతేకాకుండా ఆపరేషన్లు చేసిన డాక్టర్ జోయల్ సునీల్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు.గత నెల 25 న ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.







