ఖమ్మం జిల్లాలో మరో ఇంజెక్షన్ హత్య వెలుగులోకి వచ్చింది.కట్టుకున్న భర్తే భార్యను కడతేర్చాడు.
ఆస్పత్రిలో బాలింతగా ఉన్న భార్యకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేశాడు.ఖమ్మం రూరల్ పెద్దతండాకు చెందిన భిక్షం భార్యను ప్రసవం కోసం ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
అక్కడ ఆమెకు ఎక్కించే సెలైన్ లో మత్తు ఇంజెక్షన్ వేశాడు.దీంతో ఆమె మృతిచెందింది.
ఈ నేపథ్యంలో ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భార్య చనిపోయిందని నాటకం ఆడాడు.సీసీ కెమెరాలు పరిశీలించిన వైద్యులు.
అసలు విషయం బయటపడటంతో పోలీసులకు సమాచారం అందించారు.నిందితుడు ల్యాబ్ టెక్నిషియన్గా పనిచేస్తున్నట్టు సమాచారం.
ఇటీవలే జిల్లాలో బైకు లిఫ్ట్ అడిగి ఓ వ్యక్తికి ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసిన విషయం తెలిసిందే.