ఒకప్పటి హీరోయిన్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన రేణు దేశాయ్ గురించి మనందరికీ తెలిసిందే.రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు తన పిల్లలిద్దరికీ సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటుంది.ఇది ఇలా ఉంటే రేణు దేశాయ్ గత కొద్ది రోజులుగా స్కాట్లాండ్ వంటి విదేశాలలో తిరుగుతూ సందడి, సందడి సందడి చేస్తోంది.
తన పిల్లలు అయినా ఆధ్యా అఖిలానందంతో కలిసి అక్కడి ప్రదేశాలను తిరుగుతూ విహారయాత్రలు చేస్తోంది రేణు దేశాయ్.
ఇక స్కాట్లాండ్లోని వీధుల్లో తిరుగుతూ అందుకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూనే ఉంది.
అయితే ఆధ్యా కు సంబంధించిన ఫోటోలు ఈ మధ్యకాలంలో అంతగా బయటకు రావడం లేదు.అకిరా నందన్ అయితే కనిపించడం లేదు.ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లినట్టుగా తెలుస్తోంది.రేణు దేశాయ్ తన పాత జ్ఞాపకాలు అన్నిటినీ గుర్తు చేసుకుంది.
ఇక నీతోనే డాన్స్ షో కి సంబంధించిన ఫోటోలను వీడియోలను కూడా షేర్ చేసింది.
అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ 2017లో ఇలా ఆ షోకోసం రెడీ అయ్యాను అని చెప్పుకొచ్చింది రేణు దేశాయ్. ఇదంతా కూడా నిన్న జరిగినట్టు అనిపిస్తోందంటూ ఎమోషనల్ అయింది.నా ఐఫోనే నాకు అఫీషియల్ పర్సనల్ ఎడిటర్ అని చెబుతూ నాటి ఫోటోలను షేర్ చేసింది.
ప్రస్తుతం రేణూ దేశాయ్ షేర్ చేసిన వీడియోలు ,ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.