ఏపీసీసీ డెలిగేట్గా మెగాస్టార్ చిరంజీవికి కాంగ్రెస్ పార్టీ కొత్త ఐడీ కార్డు జారీ చేసింది.కొవ్వూరు నుంచి చిరంజీవి పీసీసీ డెలిగేట్గా ఉన్నారు.2027 వరకు పీసీసీ డెలిగేట్గా గుర్తిస్తూ చిరంజీవికి కొత్త కార్డును ఏఐసీసీ జారీ చేసింది.అయితే ఇటీవలే చిరంజీవి తనకు రాజకీయాలు దూరం కాలేదని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో చిరు రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇవ్వనున్నారా అనే అనుమానం సర్వత్రా వ్యక్తం అవుతోంది.







