చిత్తూరు: పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో మంటలు చెలరేగి ముగ్గురు వ్యక్తులు సజీవదహనమయ్యారు.ఈ ఘటన జిల్లాలోని రంగాచారి వీధిలో చోటుచేసుకుంది.
మృతులను పరిశ్రమ యజమాని భాస్కర్, ఆయన కుమారుడు ఢిల్లీబాబు, బాలాజీగా గుర్తించారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు.
ఈ ప్రమాదానికి షార్ట్సర్క్యూట్ కారణంగా పోలీసులు భావిస్తున్నారు.పరిశ్రమ యజమాని భాస్కర్ కుమారుడు ఢిల్లీబాబు సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడని స్థానికులు తెలిపారు.







