బాలీవుడ్ లో ఎలాంటి సినిమా తీస్తే ఆడుతుందో అని చాల రోజులుగా లక్ కలిసి రాలేదు.ఏ సినిమా తీసిన అట్టర్ ఫ్లాప్ అవుతుంది.
అందుకే అక్కడ మేకర్స్ సౌత్ ఇండియన్ సినిమాలను రీమేక్ చేస్తూ ఆలా పబ్బం గడిపేస్తూ ఉండేవి.కానీ ఈ మధ్య ఆ అదృష్టం కూడా లేదు.
ఎందుకంటే మన సినిమాలు అన్ని భాషల్లోనూ విడుదల అవుతూ పాన్ ఇండియన్ చిత్రాలుగా తెరకెక్కుతున్నాయి.ఇలా ఉన్న ఈ ఒక్క ఛాన్స్ కూడా వారికి లేకుండా పోయింది.
పోనీ ఏదైనా పౌరాణిక కథ తో సినిమా తీద్దాం అంటే అస్సలు అక్కడ అలాంటి ట్రెండ్ లేనే లేదు.ఆదిపురుష్ సినిమా ఫలితం ఎలా వచ్చిందో మన కళ్లారా చూసాం కదా.ఒక వేళా ఏదైనా కథ రాత్రికి రాత్రే సృష్టించిన పౌరాణికం తీయడం వారికి రానే రాదు.
ఇక పాన్ వరల్డ్ స్టార్ అయినా ప్రభాస్ అక్కడికి వెళ్లి తలపట్టుకుంటున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం.
ఇక పౌరాణికం లేదంటే ఫాంటసీ అయినా తీయాలంటే మన సౌత్ ఇండియా వారు ముందు ఉంటారు.మన తెలుగు వారు ఇంకా ఒక అడుగు ముండేస్తారు.అందులో మనమే విన్నర్స్.చిన్న సినిమా అయినా కార్తికేయ సీక్వెల్ సైతం కోట్లు కుమ్మరించగా, బ్రహ్మాస్త్ర సినిమా ఫేక్ లెక్కలతో ఎదో గొప్పలు కొట్టిన వర్క్ అవుట్ కాలేదు.
ఇదే దోవలో రామసేతు కూడా వచ్చి చేరింది.ఇక ఇన్ని సినిమాలు మరియు వాటి కాకి లెక్కలకు తోడు ఇప్పుడు కొత్తగా హృతిక్ రోషన్, రణభీర్ కపూర్ వంటి హీరోలతో రామాయణం పైన ఒక సినిమా తీయబోతున్నారు అనే విషయం బయటకు వచ్చిది.
ఈ సినిమాలో ఇంత పెద్ద కాస్టింగ్ తో పాటు సీత పాత్రా కోసం మన తెలుగు అమ్మాయి అయినా సాయి పల్లవి ని హీరోయిన్ గా తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.అదే కనక నిజమైతే వారి ఆ సినిమాను ఎలా తీస్తారు అని అందరికి పెద్ద డౌట్ ఉంది.అనుకున్నట్టు ఆ సినిమా పట్టాలెక్కితే ఒకే కానీ రామాయణం కూడా వారి చేతిలో ఎక్కడ కూలి చేయబడుతుందో అని సౌత్ ఇండియన్స్ అయితే తెగ ఆందోళన పడుతున్నారు.ఒకవేళ సీత పాత్రా సాయి పల్లవి ఒప్పుకుంటే ఆ సినిమా సగం హిట్ అయినట్టే .