ప్లాంట్ లిపిడ్ కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం పేదరిక నిర్మూలన సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.కేరళలోని కొచ్చి కేంద్రంగా అంతర్జాతీయ సంస్థ ప్లాంట్ లిపిడ్ పనిచేస్తుంది.
అయితే ఈ ఒప్పందం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సమక్షంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్లాంట్ లిపిడ్ ఎండీ జాన్ నేచు ఒప్పంద పత్రాలు ఇచ్చి పుచ్చుకున్నారు.రాష్ట్రంలో పండించే మిర్చి పంటలను పేదరిక నిర్మూలన సంస్థ- మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నడుస్తున్న 56 రైతు ఉత్పత్తి సంస్థల ద్వారా విక్రయాలు జరపనున్నారు.
ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ సంస్థ ద్వారా దాదాపు 60 కోట్ల మేర మిర్చి వ్యాపారం జరుగుతుందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.







