ఇటీవల గణేష్ నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా నేలకొండపల్లిలో జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.నేలకొండపల్లి ఎస్సై స్రవంతిరెడ్డి దళితులను అవమానపరిచేలా దూషించారని ఆరోపిస్తూ ఎమ్మార్సీఎస్, ఎంఎస్పీ నాయకులు గురువారం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.
వారియర్ గారిని కలిసి ఫిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో ఫిర్యాదులో వాస్తవాల పరిశీలించేందుకు విచారణ అధికారిగా అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ శభరిష్ (ఐపియస్) అధికారిని నియమించారు.
విచారణ అధికారి నివేదిక ఆధారంగా నేలకొండపల్లి ఎస్సై పై శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.