ఉక్రెయిన్లో రష్యా సృష్టించిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.రెండో అతి పెద్ద ప్రాంతమైన ఖర్కివ్ ను కీవ్ సేనలు ఇటీవల తిరిగి స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఇజియం ప్రాంతంలో శవాల దిబ్బలను అధికారులు గుర్తించారు.ఒక గొయ్యిలో సుమారు 440కి పైగా మృతదేహాలు ఉన్నట్లు తెలుస్తోంది.
వీరిలో కొందరు తుపాకీ గాయలతో చనిపోగా.మరికొందరు వైమానిక దాడుల కారణంగా మరణించి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
చాలా మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయని సీనియర్ దర్యాప్తు అధికారి తెలిపారు.అయితే, ఖర్కివ్ ప్రాంతంలో ఉక్రెయిన్ సైనికులు ఎదురుదాడిని తీవ్రతరం చేయడంతో రష్యా దళాలు వెనక్కి వెళ్లాయి.
దీంతో ఈ ప్రాంతాన్ని కీవ్ సేనలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి.







