ఎదుటి వారి పట్ల ఒక్కోసారి మనం చేసే పొరపాట్లు సరిదిద్దుకోలేనివిగా ఉంటాయి.కొంత మంది ఎవరైనా ఏదైనా చెబితే ఏ మాత్రం ఆలోచించకుండా ముందుకు వెళ్తుంటారు.
ఎవరో ఏదో తప్పు చేశారంటే ఏ మాత్రం స్పృహ లేకుండా ఆ వ్యక్తులను మనం కొడుతుంటాం.తీరా అంతా జరిగిపోయాక ఆ వ్యక్తులు అమాయకులు అని తేలుతుంది.
అప్పుడు కొట్టిన వారంతా తమను తాము సమర్ధించుకుంటారు కానీ, జరిగిన తప్పును బయటకు చెప్పుకోరు.బహిరంగంగా ఒప్పుకోరు.
కానీ ఏ తప్పు చేయకుండానే దెబ్బలు తిన్న వారి పరిస్థితి ఆలోచిస్తే నిజంగా చాలా బాధాకరం.సమాజంలో వారు ఏదో తప్పు చేశారనే భావం ఉంటుంది.
తాజాగా ఇదే తరహాలో కొందరు పొరబడి ఓ ట్రాన్స్జెండర్పై దాడి చేశారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
సైరా మోగ్రా జాన్ అనే ట్రాన్స్జెండర్ది మహారాష్ట్రలోని మల్కాపూర్ ప్రాంతం.ఆమె బుధవారం ఎప్పటిలాగానే బయటకు వచ్చింది.జాల్గావ్-జమోద్ బస్ స్టేషన్కు వచ్చి అక్కడ నిల్చుంది.భిక్షాటన కోసం వెళ్లాలని భావించి, తన స్నేహితురాలితో కలిసి అక్కడ వేచి చూస్తోంది.
ఈ లోపు అక్కడికి ఓ ఆటోడ్రైవర్ వచ్చాడు.అతడు అకస్మాత్తుగా వారిని చూసి ఎవరికో ఫోన్ చేశాడు.
ఇంతలో బిలబిలమంటూ అక్కడికి కొంత మంది గుంపు వచ్చేసింది.వారంతా ఆ ట్రాన్స్జెండర్ను చితక్కొట్టారు.
వారి దెబ్బలకు తాళలేక ఆ ట్రాన్స్ జెండర్ గగ్గోలు పెట్టింది.అసలు ఎందుకు కొట్టారంటే ఆ ట్రాన్స్జెండర్ పిల్లలను ఎత్తుకుపోయే వ్యక్తి అని వారంతా భావించారు.
దీంతో తమ ప్రతాపం మొత్తం ఏ మాత్రం ఆలోచించకుండా ఆ ట్రాన్స్జెండర్ పై చూపించారు.పిల్లలను ఎత్తుకుపోయే కిడ్నాపర్ అని భావించి దారుణంగా కొట్టారు.
పోలీసులు వచ్చిన ఆ ట్రాన్స్జెెండర్ను కాపాడారు.పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచారించగా అసలు విషయం తెలిసింది.
ట్రాన్స్ జెండర్ అమాయకురాలు అని తేలింది.దీంతో తనను కొట్టిన 8 మందిపై పోలీసులకు ఆ ట్రాన్స్ జెండర్ ఫిర్యాదు చేసింది.







