ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ ఎమ్మెల్యేల వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
అదే సమయంలో ఎంపీ విజయసాయిరెడ్డి వాహనం లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.దీంతో తమ వాహనాలను అడ్డుకోవడం ఏంటని పోలీసులతో టీడీపీ ఎమ్మెల్యేలు అశోక్, స్వామిలు వాగ్వివాదానికి దిగారు.
దీంతో అక్కడ కాసేపు స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.







