తెలుగు చిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్ గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నారు కృష్ణంరాజు. ఎంతో మంది హీరోలు ఉన్న నటనతో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు అని చెప్పాలి.ఆయన నటించిన ఎన్నో చిత్రాలు ఇప్పటికే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయ్ అని చెప్పాలి.
కాగా కృష్ణం రాజుది రాజుల కుటుంబం అన్న విషయం తెలిసిందే.ఆయనది క్షత్రియుల వంశం.
ఈ క్రమంలోనే సినిమాల్లోకి రాకముందు నుంచే కృష్ణం రాజు ధనవంతుడు అని చెప్పాలి.
ఇకపోతే ఇటీవలే సెప్టెంబర్ 11వ తేదీన అనారోగ్య సమస్యల కారణంగా కృష్ణంరాజు తుది శ్వాస విడిచారు.
ఈ క్రమంలోనే ఆయన గురించి సోషల్ మీడియాలో కి ఏ విషయం వచ్చినా అది హాట్ టాపిక్ గా మారిపోతుంది.ముఖ్యంగా కృష్ణంరాజుకు భారీగా ఆస్తులు ఉన్నాయి అంటూ ఒక వార్త హల్చల్ చేస్తోంది.
ఏలూరు జిల్లా మొగల్తూరులో ఇప్పటికీ కృష్ణంరాజు కోసం ఒక రాజభవనం ఉందట.కృష్ణంరాజు సినిమాల్లోకి వచ్చిన తర్వాత గోపీకృష్ణ మూవీస్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి ఎన్నో సినిమాలను నిర్మించారు.
ఆ సినిమాలతో సూపర్ హిట్ లు కూడా సాధించారు.

తద్వారా ఆయన ఆస్తుల విలువ రెట్టింపు అయింది అని చెప్పాలి.గుంటూరులో రాజభవనం జూబ్లీహిల్స్ లో ఉన్న భవనం మొత్తంగా 18 కోట్ల వరకు విలువ ఉంటుందట.కృష్ణంరాజుకు 90 లక్షల విలువచేసే మెర్సిడెస్-బెంజ్, 40 లక్షలు విలువ చేసే టొయోటా ఫార్చునర్, 90 లక్షల విలువగల వాల్వో xc60 కార్ ఉన్నాయట.2009 లోక్సభ ఎన్నికల్లో ఆయనకు 9.6 రెండు కోట్ల ఆస్తులు ఉన్నాయని.2.14 కోట్ల అప్పులు ఉన్నట్లు తెలిపారు.కృష్ణంరాజు కుటుంబానికి నాలుగు కిలోల బంగారం కూడా ఉందట.దీని విలువ దాదాపు 300 కోట్ల వరకు ఉంటుందని అంచనా.ఇలా సినిమాల ద్వారా సంపాదించగా.ఇక పూర్వీకుల నుంచి వచ్చింది.
మొత్తం కలిపి వందల కోట్లలోనే కృష్ణంరాజు ఆస్తుల విలువ ఉన్నట్లు తెలుస్తోంది.







