యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా బాహుబలి సినిమాతో మారిపోయిన విషయం తెలిసిందే.సినిమా హిట్ తర్వాత ప్రభాస్ తో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కట్టారు.
దీంతో ప్రభాస్ వరుస సినిమాలు అనౌన్స్ చేసి ఆయన ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు.అందుకే ప్రభాస్ చేతిలో ప్రెజెంట్ చాలా సినిమాలే ఉన్నాయి.
అన్ని కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.అందులో సలార్ ఒకటి.కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచు కుంటున్నారు.
ఎందుకంటే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్న నీల్ కెజిఎఫ్ తో సంచలనం సృష్టించాడు.మొన్నటి వరకు టాలీవుడ్ బంద్ కారణంగా ఆగిపోయిన షూటింగ్ ఈ రోజు స్టార్ట్ అవ్వాల్సి ఉంది.
అయితే ఇప్పుడు ప్రభాస్ చాలా కష్టకాలంలో ఉన్న విషయం విదితమే.ప్రభాస్ పెద్ద నాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు మరణంతో ఈయన క్రుంగి పోతున్నాడు.
ఇంటికి ఉన్న పెద్ద దిక్కు చనిపోవడంతో ఈయన షూటింగులను ఇప్పుడప్పుడే స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు లేదని ఇప్పుడు వార్తలు అందుతున్నాయి.
కృష్ణం రాజు మరణించకపోయి ఉంటే ఈ రోజు ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యి ఉండేది.కానీ ఈయన మరణించడంతో ప్రభాస్ పరిస్థితిని చూసి మేకర్స్ ఈ సినిమా షూట్ ను నెక్స్ట్ మంత్ కు వాయిదా వేసినట్టు తెలుస్తుంది.అంటే ఈ సినిమా అక్టోబర్ లో మళ్ళీ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.
ఇక ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా 2023 సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు.