యంగ్ హీరో శర్వానంద్ దాదాపు 5 సంవత్సరాల తర్వాత సక్సెస్ ని దక్కించుకున్నాడు.ఈయన మహానుభావుడు సినిమా తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా బొక్క బోర్లా పడ్డాయి.
మళ్లీ ఇన్నాళ్లకు ఒకే ఒక జీవితం సినిమాతో సక్సెస్ ని దక్కించుకున్నాడు.శ్రీ కార్తీక్ దర్శకత్వంలో రూపొందిన ఒకే ఒక జీవితం సినిమా విడుదలకు ముందు పెద్దగా అంచనాలు కలిగి లేదు.
ఇది ఒక ఆర్ట్ సినిమా అన్నట్లుగా ప్రేక్షకులు భావించారు.పోస్టర్ లు మరియు ప్రమోషన్ వీడియో లు కూడా అదే తరహాలో ఉండడంతో ప్రేక్షకులు అసలు ఈ సినిమా గురించి చర్చించుకోవడం కనిపించలేదు.
కానీ సినిమా విడుదల తర్వాత ఎక్కువ మంది చర్చించుకోవడం మొదలు పెట్టారు.అందుకే చిత్రాన్ని యూనిట్ సభ్యులు కూడా విడుదల కంటే ముందు ఎక్కువగా ప్రమోషన్ కార్యక్రమాలు చేయకుండా ఇప్పుడు ప్రమోషన్ కార్యక్రమాలు ఎక్కువగా చేస్తున్నారు.
శర్వానంద్ వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు ప్రముఖ యాంకర్ సుమతో కూడా ఇంటర్వ్యూ నిర్వహించారు.అలాగే అమల అక్కినేని మీడియా ముందుకు వచ్చి సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలను చేస్తున్నారు.
శర్వానంద్ వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడంతో మీడియాలో సినిమా గురించి మరింతగా టాక్ నడుస్తుంది.కనుక సినిమాకు మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా పలు ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించిందని, ఈ వీకెండ్ వరకు సినిమా పూర్తిగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది అనే నమ్మకంతో శర్వానంద్ ఉన్నాడు.ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్ గా నటించగా.
కీలక పాత్రలో వెన్నెల కిషోర్ మరియు ప్రియదర్శి నటించారు.ఈ సినిమా ఒక టైం ట్రావెల్ కథ ఆధారంగా రూపొందించింది అనే విషయం తెలిసిందే.
ఈ మధ్య కాలంలో వచ్చిన టైం ట్రావెల్ కథలు అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి.అదే దారిలో ఈ సినిమా హిట్ అయ్యింది.







