జమ్మూకశ్మీర్ నేత గులాంనబీ ఆజాద్ కొత్త పార్టీపై పది రోజుల్లో ప్రకటన చేయనున్నారు.ఆయన ఐదు దశాబ్ధాల రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ తోనే కొనసాగింది.
అయితే, కాంగ్రెస్ కు ఇక భవిష్యత్ లేదంటూ తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆజాద్ కు మద్ధతుదారులు పెరిగారు.
పార్టీలతో సంబంధం లేకుండా ఆయనకు మద్ధతు లభిస్తుంది.జమ్మూలో 30-35 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 400 మందిని కలుసుకున్నట్టు చెప్పారు.
వారంతా తనకు మద్దతు తెలిపారని, ఏ పార్టీ అయినా తనతో నడుస్తానన్నారని స్పష్టం చేశారు.







