వీఆర్ఏ బలవన్మరణం

నల్గొండ జిల్లా:మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి గ్రామానికి చెందిన వీఆర్ఏ కంచర్ల వెంకటేశ్వర్లు(37) శనివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

పేస్కేల్‌ అమలు చేయాలనే డిమాండ్‌తో వీఆర్‌ఏలు 47 రోజులుగా నిర్వహిస్తున్న నిరవధిక నిరసన కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు.

పేస్కేల్‌ అమలు కాకపోవడంతో పాటు సమ్మె కాలానికి జీతం రాకపోవడం,మరోవైపు ఆర్థిక పరిస్థితులు బాగాలేక మానసికంగా కృంగిపోయి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు.వీఆర్ఏ ఆత్మహత్యతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మండుతున్న ఎండలు..వందేళ్ల రికార్డు బ్రేక్...!

Latest Nalgonda News