హైదరాబాద్ లో రేపు సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం జరగనుంది.ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు.
ఈ భేటీలో ప్రధానంగా మునుగోడు ఉపఎన్నికపై చర్చించనున్నారు.మునుగోడు టికెట్ ఆశించి భంగపడిన నేతలకు పార్టీ పెద్దలు సర్ధిచెప్పనున్నారని తెలుస్తోంది.
అయితే, ఎన్నో చర్చల అనంతరం మునుగోడు అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఖరారు చేస్తూ అధిష్టానం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.