టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటించడం విశేషం.ఇకపోతే తెలుగుతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం మనందరికీ తెలిసిందే.
సోషల్ మీడియాలో కూడా ప్రభాస్ కి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.ఇక పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వచ్చాయి అంటే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికీ తెలిసిందే.
అటువంటి ప్రభాస్ కు సంబంధించి ఏదైనా నెగటివ్ కామెంట్స్ వినిపించినా లేదంటే ఎవరైనా ప్రభాస్ పై నెగిటివ్ గా కామెంట్స్ చేసిన సోషల్ మీడియాలో తప్పకుండా ట్రోలింగ్స్ ని ఎదుర్కోవాల్సిందే అని చెప్పవచ్చు.ఇక తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ కరీనాకపూర్ ప్రభాస్ గురించి షాపింగ్ కామెంట్స్ చేసింది.
దీంతో ప్రభాస్ అభిమానులు ఆమెపై దారుణంగా ట్రోలింగ్స్ చేయడం మొదలుపెట్టేశారు.ప్రభాస్ అర్జున్ రెడ్డి ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాను చేయనున్న సంగతి మనందరికీ తెలిసిందే.
గతేడాది అనౌన్స్ చేసిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి అప్ డేట్ రాలేదు.

కానీ ఈ సినిమా పై కరీనా కపూర్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది.ఈ క్రమంలో స్పిరిట్ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కి సంబంధించి కరీనా కపూర్ ని ఎంపిక చేశారంటూ వార్తలు వినిపించడంతో ప్రభాస్ పక్కన హీరోయిన్ల కరీనాను చూసే అవకాశం వచ్చింది అని అభిమానులు సంతోషపడ్డారు.అయితే తాజాగా ఈ వార్తల పై స్పందించిన కరీనా.
తాను స్పిరిట్ మూవీలో నటించడం లేదని, ఇప్పటివరకు స్పిరిట్ కి సంబంధించి ఎవరూ తనను సంప్రదించలేదని తేల్చి చెప్పేసింది.ఒకవేళ ప్రభాస్ తో నటించే అవకాశం వస్తే మాత్రం వదులుకోనని చెప్పినట్లు సమాచారం.
కరీనా క్లారిటీ ఇవ్వడంతో స్పిరిట్ లో ఇంకా ఎవరూ కన్ఫర్మ్ కాలేదని అర్థమైపోయింది.








