ఖమ్మం: తెరాసలో భారీ చేరికలు.ఖమ్మం కార్పొరేషన్ 44వ డివిజన్ లెనిన్ నగర్ నందు పలు పార్టీల నుండి తెరాస స్థానిక కార్పొరేటర్ పాలెపు విజయ అధ్వర్యంలో చర్మకరుల నాయకులు గంట భీమయ్య, పాల్ సంజీవరావు అధ్వర్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి సమక్షంలో 150కుటుంబాలు తెరాస పార్టీలో చేరారు.
చేరిన వారిలో జి వెంకయ్య, భద్రం, వీరస్వామి, బాలరాజు, మరియమ్మ, వెంకయ్య, కొల్లు వెంకటేశ్వర్లు, సూరమ్మ, లక్ష్మీ, ప్రభావతి, గంట సుజాత, నాగమణి, కీసర వెంకయ్య, సైదా చారి, భూక్యా జ్యోతి, బత్తుల పుల్లయ్య తదితరులు తెరాస పార్టీలో చేరారు.
వారికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.







