జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ శ్రీ మహేందర్ రెడ్డి , తెలంగాణా ఇంచార్జ్ శ్రీ శంకర్ గౌడ్ , ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ శ్రీ రామ్ తాళ్ళూరి , రాష్ట్ర సాంస్కృతిక శాఖ అధ్యక్షులు శ్రీ దుంపటి శ్రీను , సూచనలు మేరా జనసేన పార్టీ ఖమ్మం నగర అధ్యక్షులు మిరియాల జగన్మోహన్ , కన్వీనర్ ఎండీ.సాదిక్ అలీ , ప్రధాన కార్యదర్శి సూరజ్ కిరణ్ , ఉపాధ్యక్షులు గడ్డం మహేష్ ల ఆధ్వర్యంలో ఖమ్మంలో ఉదయం వైరా రోడ్ లో గల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం లో పూజలు , వివిద ప్రాంతంలో జన్మదిన కేక్ కట్ చేశారు , అనంతరం తలసేమియాతో బాధ పడుతున్న చిన్నారుల కోసం డాక్టర్ కూరపాటి ప్రదీప్ ఆధ్వర్యంలో నడుస్తున్న తలసేమియా & సికిల్ సెల్ సొసైటీ భవన్ లో 105 మంది రక్తదాతలు మరియు జనసేన యువజన విభాగం ఆధ్వర్యంలో 100 మంది రక్తదాతలు రక్తదానం చేశారు .
ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు .అనంతరం సర్టిఫికెట్స్ ను అందజేశారు .క్రికెట్ టోర్నమెంట్ను కూడా నిర్వహించారు .ఈ కార్యక్రమంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షులు డేగా రాము , కరీముల్లా , కిషోర్ , రమణ ‘ అజయ్ కార్తీక్ , పుల్లారావు , బోడా వినోద్ , ప్రభాకర్, లక్ష్మణ్ , నాగరాజు, జగదీష్ ,శీను , చిరు వెంకన్న , భారత్గ్ , దేవేందర్ ,మహిళ విభాగ అధ్యక్షురాలు భోగ హరిప్రియ , గుంత అనూష , మహాలక్ష్మి , మేడ బోయిన కార్తీక్ , యాసంనేని అజయ్ , మాలిక్ , బోస్ , G.సత్య , శ్రీకాంత్ , ఉత్తమ్ రాజ్ , A.వివేక్ , రవికిశోర్ , రమణకుమార్ , గుమ్మా .మురళి , గోపి ,రంజీత్ , ఈశ్వర్ , హరికృష్ణ , భద్రం తదితరులు పాల్గొన్నారు .