పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తాజాగా తెరకెక్కిన చిత్రం లైగర్.భారీ అంచనాల నడుమ ఈ సినిమా తాజాగా విడుదలైన విషయం తెలిసిందే.
కాగా ఈ సినిమాను చూసినా ఆ పలువురు సినీ ప్రముఖులు, ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.అంతే కాకుండా పూరి జగన్నాథ్ తన అభిమానులను మరొకసారి డిసప్పాయింట్ చేసినట్టు తెలుస్తోంది.
కాగా సినిమా విడుదలకు ముందే విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ అంటూ ఒక రేంజ్ లో హైప్ నెలకొన్న విషయం తెలిసిందే.కానీ సినిమా విడుదలైన తరువాత అంచనాలన్నీ కూడా తారుమారు అయ్యాయి.
అదే కాకుండా పూరి జగన్నాథ పై విమర్శలను గుప్పిస్తున్నారు.ప్రమోషన్స్ తో హైప్ తెచ్చుకున్నప్పటికీ సినిమాలో మాత్రం ఏమీ లేదంటూ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.అలాగే హీరో విజయ్ దేవరకొండ పై కూడా సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ జరుగుతున్నాయి.ఇది ఇలా ఉంటే తాజాగా యాంకర్ అనసూయ చేసిన కామెంట్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
అనసూయ ట్విట్టర్ వేదిక గా హీరో విజయ్ దేవరకొండనీ ఉద్దేశిస్తూ కామెంట్స్ చేసింది అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
కాగా అనసూయ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు కర్మ కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు ఏమో కానీ రావడం మాత్రం పక్కా.ఎదుటివారి బాధను చూసి సంతోష పడడం లేదు కానీ ధర్మమే గెలిచింది అంటూ అనసూయ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.అనసూయ చేసిన ట్వీట్ విజయ్ దేవరకొండ ని ఉద్దేశించి చేసినవిగా అనిపిస్తున్నాయి.
అందుకు గల కారణం కూడా లేకపోలేదు అర్జున్ రెడ్డి సినిమాలో అమ్మని తిట్టినట్టుగా ఉండే ఒక బూతు డైలాగ్ ఉంటుంది.డైలాగ్ అర్జున్ రెడ్డి మూవీ సమయంలో ఎంత కాంట్రవర్సీ నీ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే.
ఆ సమయంలో ఆ డైలాగుని అనసూయ కూడా వ్యతిరేకిస్తూ మీడియాకి ఎక్కింది.అయితే అప్పుడు అమ్మని ఉద్దేశించి చెడుగా పెట్టిన డైలాగ్.ఇప్పుడు కర్మ రూపంలో లైగర్ మూవీ గా తిరిగి వచ్చింది అనే అర్థం వచ్చే విధంగా అనసూయ కామెంట్స్ చేసింది అని వార్తలు వినిపిస్తున్నాయి.