గుంటూరు: తాడికొండ నియోజవర్గంలో అదనపు సమన్వయకర్త డొక్కా మాణిక్యవరప్రసాదరావు పర్యటన.వెంకటపాలెంలోని టీటీడీ నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.
డొక్కా మాణిక్యవరప్రసాదరావు కామెంట్స్.వెంకటపాలెం వెంకన్నని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది.
తాడికొండ సమన్వయ కర్తగా సీఎం జగన్ నియమించడం చాలా సంతోషంగా ఉంది.ఎలాంటి వివాద,విభేదాలు లేకుండా అందరితో కలిసి పార్టీని బలోపేతం చేస్తాను.
గ్రూపు రాజకీయాలకు తావు లేదు.ఉన్నది ఒకటే గ్రూపు వైసీపీ పార్టీ ,జగన్ మోహన్ రెడ్డి గ్రూప్.
సమన్వయ కర్తగా నియమించే విషయం నాకు తెలియదు.ఎమ్యెల్యే శ్రీదేవి కొంత బాధతో వున్నారు…ఆమెను కలిసి మాట్లాడి….
కలిసి పనిచేస్తాం.రాజధాని అంశం అనేది పూర్తిగా అధిష్టానం నిర్ణయం.
అధిష్టాన నిర్ణయానికే కట్టుబడి ఉంటాను.రాజధాని రైతులకు చాలా సమస్యలు ఉన్నాయి.
రైతులు ముందుకు వస్తే వాటిని రాజకీయాలకు అతీతంగా పరిష్కారానికి కృషి చేస్తాను.నేను రైతు పక్షపాతిని.
రాజధాని రైతులు రాజకీయాలకు అతీతంగా ముందుకు వస్తే…ఎమ్యెల్యే ,నేను ఇద్దరం కలసి వారి సమస్యలు పరిష్కరిస్తాం.







