మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వ పతనం ప్రారంభం అవుతుందని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.మునుగోడులో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.
ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు.
రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ విమోచన దినోత్సవం చేస్తానన్న కేసీఆర్.ఇప్పుడు మాట తప్పారని గుర్తు చేశారు.
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.
అదేవిధంగా నిరుద్యోగ యువతకు ప్రతి నెల రూ.3 వేలు ఇస్తామని చెప్పిన వాగ్ధానం ఇప్పటివరకు అమల్లోకి రాలేదని షా విమర్శించారు.దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ చెప్పారు.
కానీ జరగలేదన్నారు.మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ స్థానంలో కేటీఆర్ సీఎం అవుతారని తెలిపారు.
దళితులకు 3 ఎకరాల భూమిని ఇస్తామన్నారు.ఎవరికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ నియంత పాలనకు ప్రజలు చరమగీతం పాడి.బీజేపీని గెలిపించాలని కోరారు.