పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కిన మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా లైగర్.ఈ సినిమా ఈనెల 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇకపోతే ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన చార్మి తాజాగా డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండను ఇంటర్వ్యూ చేసింది.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఆసక్తికరమైన సమాధానాలను రాబట్టారు.ఈ సందర్భంగా ఛార్మి విజయ్ దేవరకొండను ప్రశ్నిస్తూ లైగర్ సినిమాకి సీక్వెల్ చిత్రం ఉంటుందా అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు విజయ్ దేవరకొండ సమాధానం చెబుతూ ఉండొచ్చనీ, ఉండే అవకాశం ఎక్కువగా ఉందని ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఈ సినిమా సీక్వెల్ గురించి తెలియజేయడంతో అభిమానులు మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా సీక్వెల్ గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఇంకా లైగర్ సినిమా విడుదల కాకుండానే ఈ సినిమాకి సీక్వెల్ గురించి మాట్లాడటం మంచిది కాదు.ఈ సినిమా విడుదల అయ్యి మంచి హిట్ అయితే తప్పకుండా ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని ఈయన ఈ సందర్భంగా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది.
సెన్సార్ సభ్యులు సినిమా చూసిన అనంతరం ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ జారీ చేశారు.అలాగే ఈ సినిమా రెండు గంటల 20 నిమిషాల నిడివి ఉన్నట్లు తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు.







