ప్రస్తుతం బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సినిమాల పరిస్థితి చూస్తుంటే బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఏదో శని పట్టుకున్నట్లు అనిపిస్తోంది.అయితే అలా అనడానికి గల కారణం కూడా లేకపోలేదు.
ఎందుకంటే ఈ మధ్యకాలంలో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎటువంటి సినిమాలు విడుదల అయినా కూడా బాక్సాఫీస్ వద్ద అవి ఘోరంగా బోల్తా కొడుతున్నాయి.అయితే ప్రస్తుతం వరుస ప్లాప్ సినిమాలతో ఆందోళన చెందుతున్న పలువురు దర్శక నిర్మాతలకు కొందరు పెద్ద దర్శకులు స్టార్ హీరోలు ఊపిరి పోద్దాం అని భావించినప్పటికీ చివరికి వారికి కూడా అత్యాశ మిగిలింది.
వారి సినిమాలు కూడా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలుస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాల లిస్టులోకి హీరోయిన్ తాప్సి నటించిన దొబారా సినిమా కూడా చేరింది.
తాజాగా ఆగస్టు 19న ఈ సినిమా విడుదల అయింది.కాగా ఈ సినిమాకు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించారు.అయితే ప్రేక్షకులు థియేటర్లకు కూడా రాకపోవడంతో చాలా వరకు సెలబ్రిటీలు షోలు క్యాన్సిల్ చేసుకుంటున్నారట.బాలీవుడ్ విడుదలైన సినిమాలు విడుదల అయిన మొదటి రోజు 30 లక్షలు బాగా రన్ అయితే కోటిన్నర రూపాయలు మాత్రమే రాబడుతోందట.
ఇదే విషయాన్ని అంచనా వేశారు సినీ విశ్లేషకులు.
ఈ విషయానికి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాయ్కాట్ ట్రెండ్పై తాప్సీ, అనురాగ్లు స్పందిస్తూ.దొబారా మూవీని కూడా బాయ్కాట్ చేయాలని కోరారు.అన్నట్లుగానే ఆ సినిమాను ఆదరించే నాదుడే కరువయ్యాడు.
కాగా దొబారా సినిమా 2018లో వచ్చిన మిరేగ్ అనే స్పానిష్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే.