ఇండస్ట్రీకి చెందిన కొందరు నటీనటులు ఒకే కంటెంట్ ను ఫాలో అవుతుంటారు.మరికొందరు లవ్ కాన్సెప్ట్, ఫ్యామిలీ కాన్సెప్ట్ వంటి కంటెంట్లను ఎంచుకుంటారు.
నిజానికి లవ్ కాన్సెప్ట్ తో వచ్చే కథలో కొత్తదనం ఏమీ ఉండదు.కానీ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో వచ్చే సినిమాలు తెరకెక్కించడం వల్ల ఆ కథ మొత్తం బాగా ఆసక్తిగా అనిపిస్తుంది.
ప్రారంభం నుండి చివరి వరకు ట్విస్టుల మీద ట్విస్టులతో కూడా సాగుతుంది.
అలా ఇప్పటికీ చాలా సినిమాలు విడుదల కాగా అటువంటి కాన్సెప్ట్ తో వచ్చే సినిమాలు కొందరి హీరోలకు మాత్రమే సెట్ అవుతాయి.
నిజానికి కంటెంట్ తగ్గట్టు నటులు ఉన్నారు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో.ఒకవేళ అదే కంటెంట్ తో చేసిన నటులు మరో కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తే ఎందుకో ఆ సినిమాతో అంతగా మెప్పించలేక పోతారు.
అందుకే వాళ్ళు తమ సినిమాల విషయంలో జాగ్రత్త పడుతుంటారు.అందులో ఒక ఇద్దరు హీరోలు మాత్రం తమ కథల విషయంలో ఒక్క మాదిరిగానే కనిపిస్తారు.ఇంతకు ఆ హీరోలు ఎవరంటే.నిఖిల్, అడివి శేష్.
చాలా వరకు వీరిద్దరి సినిమాలు చాలా ట్విస్ట్ లతో కూడి ఉంటుంది.అందుకే వీరి సినిమాలు మంచి సక్సెస్ అందుకుంటాయి.వీరిద్దరి సినిమాలు ఓకే కాన్సెప్ట్ తో వచ్చినట్లు అనిపిస్తాయి.ఇంతకీ వీరిద్దరి సినిమాను ఒకసారి గమనిస్తే అందులో అడివి శేష్ నటించిన సినిమాలు ఇవే.
మేజర్:
శశికిరణ్ తిక్క దర్శకత్వంలో ఈ ఏడాది విడుదలైన సినిమా మేజర్.ఇందులో అడివి శేష్, శోభిత ధూళిపాల, సయి మంజ్రేకర్ తదితరులు నటించారు.ఈ సినిమా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర నేపథ్యంలో తెరకెక్కింది.
గూఢచారి:
2018 లో శశి కిరణ్ టిక్క దర్శకత్వంలో తెరకెక్కిన్న చిత్రం గూఢచారి.ఇందులో అడివి శేష్, శోభిత దూళిపాళ్ల హీరోహీరోయిన్లుగా నటించారు.
క్షణం:
2016 లో రవికాంత్ పెరేపు దర్శకత్వంలో విడుదలైన క్రైం థ్రిల్లర్ సినిమా క్షణం.ఇందులో అడివి శేష్, అదా శర్మ ప్రధాన పాత్రలలో నటించారు.
ఎవరు:
2019లో వెంకట్ రాంజీ దర్శకత్వంలో విడుదలైన సినిమా ఎవరు.ఇందులో అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటించారు.ఈ సినిమా ది ఇన్విజిబుల్ గెస్ట్ అనే స్పానిష్ చిత్రం ఆధారంగా తెరకేక్కింది.
ఇక నిఖిల్ నటించిన సినిమాలు ఏంటంటే.
కార్తికేయ 2:
చందు మొండేటి దర్శకత్వంలో 2022లో విడుదలైన ఉత్కంఠభరిత తెలుగు చిత్రం.ఇందులో నిఖిల్, అనుపమ ప్రధాన పాత్రలు పోషించారు.
కార్తికేయ:
చందు మొండేటి దర్శకత్వంలో 2014లో విడుదలైన ఉత్కంఠభరిత తెలుగు చిత్రం.ఇందులో నిఖిల్, స్వాతి ప్రధాన పాత్రలు పోషించారు.
స్వామి రారా:
2013 లో సుధీర్ వర్మ దర్శకత్వంలో విడుదలైన ఉత్కంఠ భరిత తెలుగు సినిమా స్వామి రారా. ఇందులో నిఖిల్, స్వాతి ప్రధాన పాత్రలు పోషించారు.కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో దొంగిలింపబడిన ఓ చిన్ని విగ్రహం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
అర్జున్ సురవరం:
2019 టి.ఎన్.సంతోష్ దర్శకత్వంలో విడుదలైన సినిమా అర్జున్ సురవరం.ఇందులో నిఖిల్ సిద్ధార్థ్, లావణ్య త్రిపాఠి ముఖ్యపాత్రల్లో నటించారు.
ఈ అన్ని సినిమాలు ఓకే కంటెంట్ తో రాగా అన్నీ కొంతవరకు మంచి సక్సెస్ అందుకున్నాయి.