నల్గొండ జిల్లా:పీఏ పల్లి మండలం అంగడిపేట వద్ద అక్కంపల్లి రిజర్వాయర్ లో ముగ్గురు ఫార్మసీ విద్యార్థుల గల్లంతైన ఘటన తీవ్ర విషాదం నింపింది.మొత్తం ఎనిమిది మంది విద్యార్థులు సాగర్ చూసి వెళ్తూ ఇక్కడకు వచ్చి స్నానం కోసం వెళ్లగా ప్రాజెక్ట్ లోకి వెళ్లడంతో ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా మరొక విద్యార్థి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.మృతి చెందిన విద్యార్థులు చిలుకూరు బాలాజీ పార్మసీ కాలేజ్ కి చెందిన ఆకాష్,గణేష్,కృష్ణగా గుర్తించారు.
త