తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మునుగోడు ఎన్నికల సందడి ఎక్కువైంది.కాంగ్రెస్ పార్టీ కి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మునుగోడులో అసెంబ్లీ ఉప ఎన్నికలు అనివార్యం కావడంతో, తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి.అన్ని ప్రధాన పార్టీలు ఇక్కడ గెలుపు కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్లు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.
మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి ని విమర్శిస్తూ ఆ పోస్టర్ లో వ్యాఖ్యలు ఉన్నాయి.” మునుగోడు నిన్ను క్షమించదు రాజగోపాల్ రెడ్డి ” అంటూ పోస్టర్ లు వెలిశాయి.22 వేల కోట్లు కాంట్రాక్టు కోసం 13 ఏళ్ల నమ్మకాన్ని అమ్ముకున్న ద్రోహివి అంటూ పోస్టర్ లు వెలిశాయి.తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను ఈడీ అధికారులు విచారణ పేరుతో వేధిస్తున్న రోజునే కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో బెరమాడిన నీచుడివి అంటూ ఈ పోస్టర్ లలో విమర్శలు చేశారు.
అయితే ఈ పాస్టర్లను ఎవరు ఏర్పాటు చేశారు అనేది తెలియనప్పటికీ, ఇది ఇప్పుడు సంచలన మారాయి.ఇదంతా రేవంత్ రెడ్డి పనే అని రాజగోపాల్ రెడ్డి వర్గీయులు చేస్తున్నారు.
ఇక ఈ నియోజకవర్గంలో టిఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ పార్టీగా గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.బిజెపి తరఫున రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తుండగా టిఆర్ఎస్ కాంగ్రెస్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు.
ఇప్పటికే కొంతమంది అభ్యర్థులను ఎంపిక చేశారు .ఈ ఉప ఎన్నికలకు సంబంధించి సర్వే సంస్థలు రంగంలోకి దిగడంతో వాటి ఫలితాలు ఆధారంగా అభ్యర్థులను ప్రకటించాలని చూస్తున్నాయి.ఈ నెల 21న కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ కు రాబోతున్న తరుణంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఈ సభలోనే పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహించే విధంగా బిజెపి ప్లాన్ చేసుకుంటూ ఉండగా, మూడోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడాలంటే ముందుగా మునుగోడు ఎన్నికల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు.ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్ లు వెలువడడం తో, దీనికి గట్టి కౌంటర్ ఇచ్చే అలోచనలో రాజగోపాల్ రెడ్డి ఉన్నారట.