వెండితెర హీరోయిన్ గా, బుల్లితెర జడ్జిగా, రాజకీయ నాయకురాలిగా రోజా అందరికీ ఎంతో సుపరిచితమే.ఈమె వెండి తెరపై సుమారు 150 సినిమాలకు పైగా నటించిన మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అలాగే బుల్లితెరపై రచ్చబండ జబర్దస్త్ కార్యక్రమం వంటి కార్యక్రమాల ద్వారాఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని బుల్లితెర ప్రేక్షకులను సందడి చేశారు అయితే ప్రస్తుతం ఈమె ఏపీ మంత్రి కావడంతో పూర్తిగా బుల్లితెరకు వెండితెరకు దూరమయ్యారు.
జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి న్యాయ నిర్ణీతగా వ్యవహరిస్తున్నటువంటి రోజా మంత్రి పదవి రావడంతో ఈ కార్యక్రమానికి దూరమయ్యారు.అయితే మంత్రి పదవి దక్కిన తర్వాత రోజా గత కొద్ది రోజుల క్రితం కోట్ల విలువచేసే ఖరీదైన కారును కొనుగోలు చేసిన విషయం మనకు తెలిసిందే.
అయితే రోజా కారు కొన్న విషయంపై ప్రతిపక్ష నేతలు మాట్లాడుతూ ప్రజల సొమ్మును ఇలా తన సొంత లాభం కోసం ఉపయోగిస్తున్నారు అంటూ తనపై విమర్శలు చేశారు.
ఈ విధంగా ప్రతిపక్ష నాయకులు రోజాపై విమర్శలు చేయడంతో రోజా ఈ విషయంపై స్పందిస్తూ తాను 150 సినిమాలకు పైగా నటించానని అలాగే గత పది సంవత్సరాల నుంచి జబర్దస్త్ కార్యక్రమంలో లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటూ పని చేశానని, కావాలంటే నేను కట్టే ఇన్కమ్ టాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేసుకోండి అంటూ ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్న మాటలకు ఈమె ఈ విధంగా చెక్ పెట్టారు.తాను సినిమా ఇండస్ట్రీలో పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించి ఇలాంటి కారు కొనడంలో ఆశ్చర్యం లేదన్న ఉద్దేశంతో ఈమె ఇలా ప్రతిపక్ష నేతలు చేసే విమర్శలకు చెక్ పెట్టారు.ఇలా జబర్దస్త్ ద్వారా లక్షలు తీసుకున్నారు అంటే గత పది సంవత్సరాలలో రోజా కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకొని ఉంటారని నేటిజన్ లు భావిస్తున్నారు.