మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రెస్ మీట్... కామెంట్స్..

పార్లమెంటులో అసభ్యకర పదజాలంతో మాట్లాడే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి.రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేతల పై క్రిమినల్ కేసులు పెట్టి నిషేధం విధించాలి.

 Former Rajya Sabha Members Tg Venkatesh Press Meet... Comments Former Rajya Sabh-TeluguStop.com

చాలాసార్లు రాయలసీమ ప్రాంతంకి అన్యాయం జరిగింది. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు కర్నూలు రాజధానిగా కోల్పోయాం.

ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాదు కేంద్రంగా ఎంతగానో పెట్టుబడులు పెట్టి రాయలసీమ ప్రాంత వాసులు నష్టపోయారు.ఇప్పుడు అమరావతి రాజధానిగా ఉంది, అది రాజధానిగా కొనసాగుతుందా లేదా ప్రశ్నార్థకంగా ఉంది .నీటి వాటాల విషయంలో కూడా రాయలసీమ ప్రాంతం పూర్తి అన్యానికి గురవుతోంది.

ఎగువ తుంగభద్ర డ్యామ్ నుంచి ఎల్ ఎల్ సి కి రావాల్సిన నీటిని కర్ణాటక కొట్టేస్తుంది.

వచ్చే అరకోరా నీటిపై వాటా కావాలంటూ, తెలంగాణ పేచి చేస్తుంది.రాయలసీమ ప్రాంతం నుంచి వెళ్లే నీటిని ఇక్కడే ఆపి, ఇక్కడే వినియోగించుకోవాలి.పోలవరం నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసి, వృధాగా సముద్రం పాలవుతున్న నీటిని కోస్తాంధ్రలకు మళ్ళించాలి.సెప్టెంబర్ నుంచి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో యాత్రను ప్రారంభిస్తాం .రాయలసీమలోని ప్రతి గ్రామాన్ని, పట్టణాన్ని సందర్శిస్తూ ప్రజా సమస్యలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి చేయాల్సిన పనుల గురించి ప్రజలకు వివరిస్తాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube