పార్లమెంటులో అసభ్యకర పదజాలంతో మాట్లాడే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి.రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేతల పై క్రిమినల్ కేసులు పెట్టి నిషేధం విధించాలి.
చాలాసార్లు రాయలసీమ ప్రాంతంకి అన్యాయం జరిగింది. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు కర్నూలు రాజధానిగా కోల్పోయాం.
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాదు కేంద్రంగా ఎంతగానో పెట్టుబడులు పెట్టి రాయలసీమ ప్రాంత వాసులు నష్టపోయారు.ఇప్పుడు అమరావతి రాజధానిగా ఉంది, అది రాజధానిగా కొనసాగుతుందా లేదా ప్రశ్నార్థకంగా ఉంది .నీటి వాటాల విషయంలో కూడా రాయలసీమ ప్రాంతం పూర్తి అన్యానికి గురవుతోంది.
ఎగువ తుంగభద్ర డ్యామ్ నుంచి ఎల్ ఎల్ సి కి రావాల్సిన నీటిని కర్ణాటక కొట్టేస్తుంది.
వచ్చే అరకోరా నీటిపై వాటా కావాలంటూ, తెలంగాణ పేచి చేస్తుంది.రాయలసీమ ప్రాంతం నుంచి వెళ్లే నీటిని ఇక్కడే ఆపి, ఇక్కడే వినియోగించుకోవాలి.పోలవరం నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసి, వృధాగా సముద్రం పాలవుతున్న నీటిని కోస్తాంధ్రలకు మళ్ళించాలి.సెప్టెంబర్ నుంచి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో యాత్రను ప్రారంభిస్తాం .రాయలసీమలోని ప్రతి గ్రామాన్ని, పట్టణాన్ని సందర్శిస్తూ ప్రజా సమస్యలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి చేయాల్సిన పనుల గురించి ప్రజలకు వివరిస్తాం.